వరదలో చిక్కుకున్న రైతులు.. సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు

దిశ ప్రతినిధి, కరీంనగర్: నిరాంటకంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజాగా.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతరం వాగులో ఎనిమిది మంది రైతులు చిక్కుకున్నారు. వాగు ఉప్పొంగడంతో ఎత్తుగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. వీరిని అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లి వాగులో నీటి ఉధృతి ఉన్నపళంగా పెరగడంతో చిక్కుకుపోయారు. మరోవైపున వేంపల్లి వాగులో ఒకరు గల్లంతయ్యారు.

Update: 2021-07-15 10:38 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: నిరాంటకంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజాగా.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతరం వాగులో ఎనిమిది మంది రైతులు చిక్కుకున్నారు. వాగు ఉప్పొంగడంతో ఎత్తుగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. వీరిని అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లి వాగులో నీటి ఉధృతి ఉన్నపళంగా పెరగడంతో చిక్కుకుపోయారు. మరోవైపున వేంపల్లి వాగులో ఒకరు గల్లంతయ్యారు.

Tags:    

Similar News