స్థానికులకే టీటీడీ దర్శనం టికెట్లు..

దిశ, ఏపీబ్యూరో : డిసెంబరు 25 నుంచి జనవరి 3 వరకు సంబంధించి తిరుమల సర్వదర్శనం టికెట్లు ఈనెల 24 నుంచి స్థానికులకు మాత్రమే జారీ చేస్తామని టీటీడీ ఈవో కేఎస్​ జవహర్ రెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల భక్తులు ఈ విషయం గమనించాలని ఆయన కోరారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10రోజుల పాటు సర్వ దర్శనం టికెట్లు జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కౌంటర్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ..24 […]

Update: 2020-12-22 11:13 GMT

దిశ, ఏపీబ్యూరో : డిసెంబరు 25 నుంచి జనవరి 3 వరకు సంబంధించి తిరుమల సర్వదర్శనం టికెట్లు ఈనెల 24 నుంచి స్థానికులకు మాత్రమే జారీ చేస్తామని టీటీడీ ఈవో కేఎస్​ జవహర్ రెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల భక్తులు ఈ విషయం గమనించాలని ఆయన కోరారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10రోజుల పాటు సర్వ దర్శనం టికెట్లు జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కౌంటర్లను మంగళవారం ఆయన పరిశీలించారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ..24 నుంచి ఈ కేంద్రాల్లో రోజుకు 10 వేల చొప్పున 10 రోజులకు లక్ష సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తామన్నారు. రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు 2 లక్షల టికెట్లు ఇప్పటికే ఆన్లైన్‌లో జారీ చేసినట్లు ఈవో తెలిపారు. టికెట్ ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి, శ్రీ వారి మెట్టు నడకదారులు, అలిపిరి రోడ్డు మార్గంలో అనుమతిస్తామన్నారు. భక్తులు టికెట్ లేకుండా వచ్చి ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు.

Tags:    

Similar News