ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి(స్టేట్ సిలబస్, ఇంగ్లీష్ మీడియం) లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది

Update: 2023-03-08 12:34 GMT

దిశ, ఎడ్యుకేషన్: విజయవాడలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి(స్టేట్ సిలబస్, ఇంగ్లీష్ మీడియం) లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు ఏప్రిల్ 4 లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.

వివరాలు:

మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2023.

విద్యార్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి చదివి ఉండాలి.

విద్యార్థులు సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న వారై ఉండాలి.

వయసు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య; ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆదాయ పరిమితి: తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించరాదు.

పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 50 మార్కులకు నిర్వహిస్తారు.

పరీక్ష తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు - 10 మార్కులు, ఇంగ్లీష్ - 10 మార్కులు, గణితం - 15 మార్కులు, పరిసరాల విజ్ఞానం నుంచి(15 మార్కులకు ప్రశ్నా పత్రం ఉంటుంది.

ఎంపిక: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరి ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 5, 2023.

చివరి తేదీ: ఏప్రిల్ 4, 2023.

పరీక్ష తేదీ: ఏప్రిల్ 16, 2023.

వెబ్‌సైట్: https://mjpapbcwreis.apcfss.in

Tags:    

Similar News