నవరాత్రులలో ఆరవ రోజున ఏ తల్లిని పూజిస్తారు.. శ్రీ కృష్ణునికి ఈ రోజుకు సంబంధం ఏంటి..

దేశ వ్యాప్తంగా శారదీయ నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు భక్తులు.

Update: 2024-10-08 04:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా శారదీయ నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు భక్తులు. ఈ పండుగ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ నవరాత్రుల్లో దుర్గమ్మ వారిని 9 రూపాలలో పూజిస్తారు. హిందూ మతంలో దుర్గాదేవిని ఆరాధించడం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారదీయ నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయని మాతను పూజిస్తారు. తల్లి కాత్యాయనికి నాలుగు చేతులు కలిగి ఉంటాయి. ఇంతకీ ఈ కాత్యాయని మాత ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.

కాత్యాయనీ మాత పుట్టిన పౌరాణిక కథ..

పూర్వం ఓ అడవిలో కాట్ అనే మహర్షి ఉండేవాడు. వారికి కాత్య అనే కుమారుడు ఉన్నాడు. కానీ మహర్షికి సంతానం కలగలేదు. సంతానం పొందడం కోసం అతను తపస్సు చేశారు. అతని తపస్సుకు సంతసించిన తల్లి పరంబర అతనికి కాత్యాయని రూపంలో ఒక కుమార్తెను ప్రసాదించింది. కాత్యాయనుని కుమార్తె కావడంతో ఆమెకు కాత్యాయని అని పేరు పెట్టారు. మహిషాసురుడు అనే ప్రమాదకరమైన రాక్షసుడిని నాశనం చేసింది ఆ తల్లి.

మా కాత్యాయని పూజా ఫలం..

కాత్యాయని మాత ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. భక్తులు మాతా రాణిని హృదయపూర్వకంగా పూజిస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. వారు సంపద, సంతోషం, మోక్షాన్ని పొందుతారు. అంతే కాదు మాతా రాణి తన భక్తులకు ప్రత్యేక ఆశీర్వాదాలను కూడా అందిస్తుంది. వివాహంలో ఎవరైనా అడ్డంకుల ఎదుర్కొంటున్నట్లయితే, అలాంటి వారిపై కూడా తల్లి ఆశీస్సులు కురుస్తాయి. వారి వివాహ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.

శ్రీ కృష్ణునికి సంబంధించిన కథ..

మాతా కాత్యాయనిని బ్రిజ్ మండల్ అధిష్టానం అని పిలుస్తారు. కృష్ణుడికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది. కృష్ణుడిని పొందడం కోసం, రాధతో సహా గోపికలందరూ మాతా కాత్యాయనిని పూజించారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో మాత కాత్యాయని సంతోషించి వారందరికీ వరం అందించిందట. ఆ తర్వాతే గోపికలు కృష్ణుడిని పొందగలిగారని పురాణం.


Similar News