Tirumala Updates: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. అన్ని కంపార్ట్‌మెంట్లు హౌజ్‌ ఫుల్

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల కొనసాగుతోంది.

Update: 2024-06-30 05:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగిసినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి టీబీసీ వరకు భక్తుల క్యూలైన్ కొనసాగుతోంది. శనివారం స్వామి వారిని 80,404 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 35,825 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Similar News