Tirumala Updates: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి 8 గంటల సమయం

ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Update: 2024-09-28 04:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం శ్రీవారి దర్శనానికి జనం ఓ మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనం (Special Darshan) కోసం టోకెన్లు తీసుకున్న వారికి 2 గంటల సమయం పడుతోంది. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి చూస్తున్నారు. బుధవారం స్వామి వారిని 64,158 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 24,938 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. 


Similar News