Tirumala Samacharam: దీపావళి పండుగ ఎఫెక్ట్.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

దీపావళి (Diwali) పర్వదినం సందర్భంగా వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

Update: 2024-11-01 02:25 GMT
Tirumala Samacharam: దీపావళి పండుగ ఎఫెక్ట్.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి (Diwali) పర్వదినం సందర్భంగా వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గరువారం స్వామి వారిని దర్శించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 4 గంటల సమయం పడుతోంది.

అదేవిధంగా శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిక్కిరిపోయాయి. టీబీసీ కౌంటర్ (TBC Counter) వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. గురువారం స్వామి వారిని 63,987 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.2.66 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.

Tags:    

Similar News