Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లో భక్తులు (Devotee) వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 72,981 మంది స్వామివారిని దర్శించుకోగా 21,120 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఏడు కొండలవాడికి కానుకల రూపంలో హుండీలో రూ. 5.09 కోట్లు సమర్పించారు. అయితే, విద్యార్థులకు పరీక్షలు ముగియటంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.