లవకుశులు జన్మించిన పుణ్యస్థలం ఎక్కడో తెలుసా..

మహర్షి వాల్మీకి ఆశ్రమం బాగ్‌పత్ జిల్లాలో ఉంది. ఇది రామాయణ కాలానికి సంబంధించిన పవిత్ర స్థలం. ఈ ఆశ్రమానికి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే కాదు, దేశం మొత్తం మీద ప్రాముఖ్యత ఉంది.

Update: 2024-09-24 16:03 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : మహర్షి వాల్మీకి ఆశ్రమం బాగ్‌పత్ జిల్లాలో ఉంది. ఇది రామాయణ కాలానికి సంబంధించిన పవిత్ర స్థలం. ఈ ఆశ్రమానికి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే కాదు, దేశం మొత్తం మీద ప్రాముఖ్యత ఉంది. ప్రజలు ఆ ఆశ్రమాన్ని విశ్వాసానికి పెద్ద కేంద్రంగా చూస్తారు. రామాయణానికి సంబంధించిన సంఘటనలను తెలుసుకోవడానికి, శ్రీరాముని జీవితానికి సంబంధించిన అనేక విషయాను తెలుసుకునేందుకు ప్రజలు ఈ చారిత్రక ప్రదేశానికి వస్తుంటారు.

లువకుశుల జన్మస్థలం...

మహంత్ ఆనందేశ్వర్ గిరి మహారాజ్ తెలిపిన వివరాల ప్రకారం లువకుశులు ఈ ఆశ్రమంలో జన్మించారని తెలిపారు. రాముడు సీతను విడిచిపెట్టినప్పుడు, లక్ష్మణుడు ఆమెను ఈ ప్రదేశంలో విడిచిపెట్టాడని తెలిపారు. లవకుశులు ఇక్కడే చదువుకున్నారని, ఈ ప్రదేశం వారి జీవితంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా మారిందని తెలిపారు.

 భారీ సంఖ్యలో భక్తుల రద్దీ..

నవరాత్రి, ఇతర పండుగల సమయంలో ఈ పవిత్ర స్థలంలో భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా అఖా తీజ్‌లో పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. ఎందుకంటే లవకుశులు ఈ రోజున జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. భక్తులు పాల్గొనే తొమ్మిది రోజుల పాటు ఆచారాలు నిర్వహిస్తారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారని చెబుతారు.


Similar News