Tirupati: వరుస సెలవులు.. తిరుమల కొండపై భక్తుల రద్దీ
వరుస సెలవులు రావటంతో ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: వరుస సెలవులు రావటంతో ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్ వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,987 మంది భక్తులు దర్శించుకోగా.. 26,880 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే హుండీ ఆదాయం రూ. 2.88 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ (TTD) వెల్లడించింది.