800 ఏళ్ల నాటి లక్ష్మీదేవి ఆలయం.. ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు పరార్..

లక్ష్మీ దేవి అనుగ్రహం పొందిన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని చెబుతారు.

Update: 2024-09-20 09:18 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : లక్ష్మీ దేవి అనుగ్రహం పొందిన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని చెబుతారు. ఎల్లప్పుడూ ఆర్థిక సంక్షోభానికి గురవుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారు జీవితంలో డబ్బు విషయాలలో ఎల్లప్పుడూ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ప్రజల ఆర్థిక సమస్యలు తీరుతాయి. భారతదేశంలో లక్ష్మీదేవికి సంబంధించిన అనేక పురాతన ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. 800 ఏళ్ల నాటి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏమిటి, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆలయం ఎక్కడ ఉంది ?

ఈ అరుదైన లక్ష్మీ దేవి ఆలయాన్ని లఖ్నీ దేవి ఆలయం అని పిలుస్తారు. ఇందులో లఖ్నీ అనే పదం లక్ష్మీదేవి పేరు నుండి ఉద్భవించింది. ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉన్న కొండను లక్ష్మీధామ్ పర్వతం, వరాహ పర్వతం, ఇక్బిరా పర్వతం అని కూడా అంటారు. ఈ ఆలయం రాజు రత్నదేవ్ III పాలనలో నిర్మించారు. దీనిని 1179లో మంత్రి గంగాధర్ నిర్మించారు. ఈ విషయంలో ఈ ఆలయం నిర్మించి 845 సంవత్సరాలు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దాదాపు 300 మెట్లు ఎక్కాలి. 800 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయంలో ప్రజల ఆర్థిక సమస్యలు తీరుతాయని చెబుతారు.

ఆనందం, శ్రేయస్సు..

ఈ లఖ్నీ మా ఆలయం చాలా పురాతనమైనది మాత్రమే కాకుండా ప్రసిద్ధి చెందినది కూడా. ఈ ఆలయానికి సంబంధించిన ఒక కథ ఏమిటంటే 1178లో రాజు రత్నదేవ్ III సింహాసనాన్ని అధిష్టించినప్పుడు, అక్కడ కరువు, అంటువ్యాధి, పేదరికం వ్యాపించాయి. క్రమేణా ఖజానా నుంచి డబ్బు మొత్తం ఖాళీ అయింది. ఈ సమయంలో రాజు దగ్గరి మంత్రి లక్ష్మీదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం కట్టిన వెంటనే ఆ ప్రదేశంలో సంపద తిరిగి వచ్చింది, డబ్బు కొరత క్రమంగా తొలగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి.

శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ?

హిందూ మత విశ్వాసాలలో శుక్రవారం లక్ష్మీదేవి రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదమని, ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుందని చెబుతారు. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి. ముందుగా ఇంటిని శుభ్రం చేసి తల స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత లక్ష్మీ దేవిని పూజించి, శంఖం, గులాబీ పువ్వు, తామర పువ్వును ఆమెకు సమర్పించాలి. అలాగే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, ఈ రోజున పంచదార, మిఠాయి, ఖీర్ ను నైవేద్యంగా ప్రసాదించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి కరుణిస్తుందని చెబుతున్నారు.


Similar News