షాకింగ్ ఘటన..పిడుగు పడి ఇద్దరు ఫుట్బాల్ ప్లేయర్ల దుర్మరణం
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఎక్కడ ఉన్నా కూడా ప్రజల ప్రాణాలు పోతాయి. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి.
దిశ,వెబ్డెస్క్:ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఎక్కడ ఉన్నా కూడా ప్రజల ప్రాణాలు పోతాయి. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతటి వారైన బలి కావాల్సిందే. అయితే ఈ ప్రమాదాలకు సంబంధించి నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..ఝార్ఖండ్లో విషాదం చోటుచేసుకుంది. లాతెహార్ జిల్లాలో ఫుట్బాల్ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు ప్లేయర్లు మరణించారు. మరో 11 మంది గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు. గాయపడినవారికి బాలుమాథ్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా మరణించిన వారిని దీపక్ కుమార్, వీరేంద్ర గా గుర్తించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.