Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపో-కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

నెల్లూరులోని మర్రిపాడు మండలం చుంచులూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-08-29 04:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరులోని మర్రిపాడు మండలం చుంచులూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో ట్రావెలర్ ను కార ఢీకొట్టడంతో దంపతులు, తమ కుమారుడు అక్కడికక్కడే మరణించారు. మృతులు బోటిక శ్రీనివాసులు(50), పుష్ప (45), కుమారుడు శ్రీకాంత్ (20) లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కథకం ప్రకారం.. మరణించిన వారు ఎలక్ట్రానిక్స్ సిటీకి చెందిన వారని, ఏదో కార్యక్రమానికి వెళ్తున్నారని తెలిపారు. తమ కుమారుడు వాహనాన్ని స్పీడ్‌గా నడపడం ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. వాహనాన్ని ఓవర్‌టేక్ చేసి ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్‌ను గమనించలేకపోయిందని విచారణలో తేలింది. దీంతో టెంపో ట్రావెలర్‌ను కారు ఢీకొని ముగ్గురు వ్యక్తులు స్పాట్ డెడ్ అయ్యారన్నారు. కారు ముందు నుజ్జు నుజ్జు అయ్యిందని తెలిపారు. బోయకుండ నుంచి బెంగళూరుకు వెళ్తోన్న క్రమంలో కూడా మరో ప్రమాదం చోటుచేసుకోగా.. 12 మంది గాయపడ్డారు. కానీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. 


Similar News