ఘోరం.. కొంప ముంచిన మస్కిటో కాయిల్.. కొడుకు మృతి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తల్లి..!

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. దోమలు రాకుండా పెట్టే కాయిల్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది.

Update: 2024-09-01 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. దోమలు రాకుండా పెట్టే కాయిల్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. కూకట్‌పల్లి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..

కూకట్‌పల్లిలోని శివానంద రీహాబిటేషన్ హోమ్‌లో విమల అనే మహిళ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తూ తన తల్లిదండ్రులతో కలిసి ఒక క్వార్టర్స్‌లో నివాసం ఉంటోంది. గత శుక్రవారం(ఆగస్టు 30) రోజు రాత్రి తమ స్వగ్రామం బాపట్ల నుండి ఉన్నత చదువుల కోసం కోసం వచ్చిన తమ్ముడు తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్నారు. ఇదే క్రమంలో దోమల నివారణకు ఉంచిన మస్కిటో కాయిల్ మండి చుట్టు పక్కల ఉన్న వస్తువులకు అంటుకుంది. అదీకాస్తా, కిచెన్‌లోని సిలిండర్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. దీంతో ఊపిరి ఆడక అభిషేక్ (27) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇక తల్లి దీనమ్మ 35% కాలిన గాయాలతో పక్కనే ఉన్న రాందేవ్ రావు ఆసుపత్రిలో ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

కాగా, ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రి వర్గాలు కానీ, పోలీసులు కానీ, ఫైర్ ఉద్యోగులు గాని స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. చివరికి యువకుడి మరణంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Similar News