Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు స్పాట్ డెడ్

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో కారు, బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది.

Update: 2024-09-12 10:37 GMT

దిశ,వెబ్‌డెస్క్:తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో కారు, బైక్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నేడు (గురువారం) కలకడ నుంచి చెన్నైకి టమాట లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ లారీ చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కారును, మరో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


Similar News