యువకుడి ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాతవూరుకు చెందిన శేషాపు తేజేష్(20) శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తణుకు పట్టణ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు.

Update: 2024-09-29 13:02 GMT

దిశ,తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాతవూరుకు చెందిన శేషాపు తేజేష్(20) శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తణుకు పట్టణ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. తాడేపల్లిగూడెంలో తాతయ్య అప్పలనాయుడు వద్ద ఉంటూ చదువుకునే వాడు రెండు నెలల క్రితం ఆయన మృతి చెందడంతో నెల క్రితం తాడేపల్లిగూడెం నుంచి తణుకు తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. తేజేష్ శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


Similar News