దొంగల బీభత్సం.. 5లక్షల విలువైన బంగారం చోరీ

అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని బోనగిరి పల్లి ఆర్చి సమీపంలోని శ్రీ కృష్ణదేవ రాయలు నగర్‌లో ఓ ఇంట్లో గత రాత్రి చోరీ జరిగింది.

Update: 2024-09-29 13:27 GMT

దిశ, కడప: అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని బోనగిరి పల్లి ఆర్చి సమీపంలోని శ్రీ కృష్ణదేవ రాయలు నగర్‌లో ఓ ఇంట్లో గత రాత్రి చోరీ జరిగింది. ముదాం రవి అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి ఇంటిలోని కబోర్డులు, బీరువాలో వస్తువులను చిందర వందర చేసి 5 లక్షల రూపాయలు విలువ చేసే 70 గ్రాములు బంగారు నగలు చోరీ చేశారు. వాటిలో ఐదు జతల కమ్మలు, రెండు నల్లపూసల చైన్లు, ముత్యాల హారం, నెక్లెస్, మూడు ఉంగరాలు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపింది. అదే విధంగా ఇంట్లోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ కూడా దుండగులు తమ ఆనవాళ్లు తెలియకుండా పట్టుకెళ్ళారు. చోరీకి గురైన సంఘటన స్థలాన్ని పట్టణ సీఐ యల్లంరాజు, ఎస్సై ప్రసాద్ రెడ్డి, ఏఎస్ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ కాసిం పీరాలు క్లూస్ టీం తో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో ఇటీవల తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో పట్టణవాసులు బెంబేలెత్తుతున్నారు.


Similar News