Venkatadri: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి అలజడి.. కత్తులతో దోపిడీ దొంగల హల్‌చల్

దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన భయానక ఘటన గురువారం అర్ధరాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ (Venkatadri Express)లో చోటుచేసుకుంది.

Update: 2025-04-04 05:09 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన భయానక ఘటన గురువారం అర్ధరాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ (Venkatadri Express)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు (Chittoor) నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కాచిగూడ (Kachiguda)కు బయలుదేరింది. ఈ క్రమంలోనే ట్రైన్ క్రాసింగ్ కోసం కర్నూలు జిల్లా (Kurnool District) బోగోలు రైల్వే స్టేషన్ (Bogolu Railway Station) సమీపంలో ఆగింది. ఇదే అదనుగా భావించిన ఇద్దరు దోపిడీ దొంగలు చేతిలో కత్తులు పట్టుకుని ఎస్-2 (S2) బోగిలోకి ప్రవేశించారు. అనంతరం అక్కడే ఉన్న ఇద్దరు మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన ఇతర ప్రయాణికులపై కూడా వారు దాడి చేసేందుకు యత్నించారు. ఈ మేరకు బాధితులు కర్నూలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Similar News