స్నేహితుల మోసం.. యువకుడు ఆత్మహత్య

స్నేహితుల మోసం చేశారని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-09-27 13:07 GMT

దిశ,మందమర్రి : స్నేహితుల మోసం చేశారని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మందమర్రికి చెందిన దాసరి రాజేష్ (32) అనే యువకుడు వృత్తిరీత్యా కుటుంబంతో కే.పి.హెచ్.బి. గోకుల్ ప్లాట్స్ లో నివసిస్తున్నాడు. మృతుడు ,తన స్నేహితులు బొంతల వినయ్, కొత్తపల్లి శ్రీనివాస్ భూమి విషయంలో మోసం చేశారని, తన చావుకు వారే కారణం అని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 25 సెప్టెంబర్ రోజున భూమి విషయం మాట్లాడేది ఉందని ఇంట్లో భార్యకు చెప్పి మృతుడు బయటకు వెళ్లినట్లు సమాచారం. ఆ రాత్రి రాజేష్ ఇంటికి రాకపోవడంతో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో మృతుని భార్య కుసుమల ఫిర్యాదు చేసింది. కాగా ప్రగతి నగర్ చెరువులో రాజేష్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తోంది.


Similar News