మత్తు పదార్థంగా బోనోఫిక్స్ వినియోగం
మత్తు కలిగించే బోనో ఫిక్స్ ను చిన్న పిల్లలకు విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్టు ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ తెలిపారు.

దిశ, ఏటూరునాగారం : మత్తు కలిగించే బోనో ఫిక్స్ ను చిన్న పిల్లలకు విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్టు ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మత్తు కలిగించే పదార్థాలను చిన్న పిల్లలకు విక్రయిస్తున్న వారిపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే మండల కేంద్రానికి చెందిన కంగన్ హాల్ లో వ్యాపారం నిర్వహిస్తున్న బట్టు సుజాత అనే మహిళ బోనోఫిక్స్ నిల్వ చేసి విద్యార్థులకు, యువతకు విక్రయిస్తుంది. బోనోఫిక్స్ ను టైర్లు, పంక్చర్లు వేయడానికి మాత్రమే ఉపయోగిస్తారని తెలిపారు. దీనిని కర్చీప్లలో వేసి పీల్చడంతో మత్తు వస్తుందని తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.