బజ్జీలు అప్పు ఇవ్వలేదని నూనెతో దాడి

మిర్చి బజ్జీలు అప్పుకు ఇవ్వలేదని హోటల్ యజమాని పై ఓ వ్యక్తి వేడి నూనెను పోశాడు.

Update: 2024-09-29 13:36 GMT

దిశ,‌కేటిదొడ్డి : మిర్చి బజ్జీలు అప్పుకు ఇవ్వలేదని హోటల్ యజమాని పై ఓ వ్యక్తి వేడి నూనెను పోశాడు. దాంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బి.శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని గువ్వలదిన్నె గ్రామానికి చెందిన బుజ్జన్న గౌడ్ గ్రామంలో చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు.

    శనివారం రాత్రి గ్రామానికి చెందిన వినోద్ హోటల్ యజమానిని బజ్జీలు ఉద్దెరకు ఇవ్వాలని కోరగా ఇవ్వలేదు. దాంతో వినోద్ ఆగ్రహంతో పొయ్యి మీద కలాయిలో మరుగుతున్న నూనెను యాజమాని బుజ్జన్న గౌడ్ పై పోశాడు. దాంతో ఇతని వెనకాల కూర్చున్న వీరేష్ అనే వ్యక్తిపై కూడా పడింది. దాంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరేష్ భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి‌ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Tags:    

Similar News