కరెంట్ షాక్ తో యువకుడు మృతి..

జహీరాబాద్ మండలం శేఖపూర్ తండాలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-09-29 10:55 GMT

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ మండలం శేఖపూర్ తండాలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన విశాల్ అనే యువకుడు విద్యుత్ షాక్ తో మరణించాడు. ఉదయం తండ్రితో కలిసి పొలానికి వెళ్లారు. బోరు మోటార్ స్టార్ట్ చేసేందుకు స్టార్టర్ మీటర్ నొక్కగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. ఇది గమనించిన తండ్రి కొడుకును కాపాడేందుకు విఫలయత్నం చేశాడు. ఫలితం లేకపోవడంతో ఏడుస్తూ తండాకు పరుగులు తీశాడు. వచ్చేసరికి ఆయన మృతి చెందాడు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయం తెలుసుకొని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ, స్థానిక ఏరియా ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను, గ్రామస్థులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొని, తన ప్రగాఢ సానుభూతి తెలిపి, కుటుంబసభ్యుల్లో మనో ధైర్యం కల్పించారు. వారితో పాటు తాజా మాజీ సర్పంచ్ చిన్న రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరో రాథోడ్ , మోహన్ నాయక్ తదితరులున్నారు.


Similar News