అందరితో కలిసిపోయే వ్యక్తి అంతలోనే అనంతలోకాలకు
చందుర్తి మండల ఊరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దిశ, చందుర్తి : చందుర్తి మండల ఊరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన పోతరాజు గంగాధర్ (45) గత శనివారం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గంగాధర్ మృతితో మల్యాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అకాల మరణం సంభవించడంతో గ్రామ ప్రజల, గంగాధర్ బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.