అనుమానంతో భార్యను చంపిన భర్త

కుటుంబ కలహాలు అనుమానం పెనుభూతమై భార్యను కడతేర్చాడు కట్టుకున్న భర్త. ఈ సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

Update: 2024-10-13 14:59 GMT

దిశ, చైతన్య పురి : కుటుంబ కలహాలు అనుమానం పెనుభూతమై భార్యను కడతేర్చాడు కట్టుకున్న భర్త. ఈ సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొంజూరు గ్రామానికి చెందిన గుంజి సోనీ వెంకటేశం దంపతులు తన ఇద్దరు కుమారులతో కలిసి సరూర్ నగర్ లోని సరస్వతి నగర్ కాలనీ కి వలస వచ్చారు. వెంకటేష్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషులు పలుమార్లు మాట్లాడి సమస్య పరిష్కరించారు. అయినా గొడవలు ఆగలేదు.

ఈ క్రమంలో పిల్లలు ఆడుకోవడానికి ఆదివారం మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళగా… భార్యాభర్తలు పంజాబీ డ్రెస్ విషయంలో గొడవపడ్డారు. వెంకటేష్ కోపంతో కూరగాయలు కోసే కత్తితో సోనీ కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కాగా కుప్పకూలింది. ఘటనలో వెంకటేష్ చేతికి గాయమైంది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్ ద్వారా చికిత్సకు తరలించాలని చూడగా అప్పటికే తీవ్ర రక్తస్రావం కాగా సోనీ మృతి చెందింది. గాయపడిన వెంకటేష్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Similar News