ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత
ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు (72) కన్నుమూశారు.
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు (72) కన్నుమూశారు. ఈయన డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం నరసింగరావు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు(బుధవారం) తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా నరసింగరావుకి భార్య, కుమార్తె ఉన్నారు.