‘క్రిష్-4’లో హృతిక్ రోషన్‌తో జతకట్టబోతున్నమహేష్ బాబు హీరోయిన్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన ‘క్రిష్’ ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకువచ్చారు.

Update: 2025-04-09 13:40 GMT
‘క్రిష్-4’లో హృతిక్ రోషన్‌తో జతకట్టబోతున్నమహేష్ బాబు హీరోయిన్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన ‘క్రిష్’ ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకువచ్చారు. అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో 2013లో ‘క్రిష్-3’ చిత్రాన్ని విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ‘క్రిష్-4’ (Krish-4)హృతిక్ స్వయం దర్శకత్వంలో రాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. హృతిక్‌తో పాటు ఆదిత్యచోప్రా దీనిని తెరకెక్కించనున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైనప్పటి నుంచి ‘క్రిష్-4’కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నటించబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘క్రిష్-4’ హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రీతి జింటా(Preity Zinta), వివేక్ ఒబెరాయ్, రేఖ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. కాగా, ప్రియాంక చోప్రా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘SSMB-29’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News