బిగ్ అనౌన్స్మెంట్తో సర్ప్రైజ్ చేసిన దిల్ రాజు.. సంచలనాలు సృష్టించోతున్నామంటూ ట్వీట్!
టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు (Dil Raju)వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు (Dil Raju)వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఆయన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) ద్వారా కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను తెరకెక్కిస్తూ లాభాలు పొందుతున్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టి లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో అదే ఫామ్లో ఉన్న దిల్ రాజు ప్రజెంట్ ఆయన బ్యానర్లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్తో పాటు, నితిన్ (Nithin)‘తమ్ముడు’ వంటి చిత్రాలు రాబోతున్నాయి.
అయితే ఆయన నిర్మాతగానే కాకుండా.. తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా, దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నట్లు తెలుపుతూ సినీ ప్రియులందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఆయన ఏఐ ఆధారిత మీడియాను స్థాపించబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన నిర్మాణ సంస్థ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘అతను ఒక దృష్టితో ప్రారంభించాడు. ఆయన మనకు మరపురాని కథలు అందించారు. ఇప్పుడు, అతను సినిమాను మించిన దాన్ని నిర్మిస్తున్నారు. మా బ్లాక్బస్టర్ నిర్మాత దిల్రాజు తెలివైన వారితో కలిసి పని చేస్తున్నారు.
క్వాంటమ్ ఏఐ గ్లోబల్ AI-ఆధారిత మీడియా కంపెనీని ప్రారంభించేందుకు. వినోద పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అధునాతన AI సాధనాలను అభివృద్ధి చేయడానికి, అందించడానికి స్థలాన్ని చూస్తున్నారు. మే 4న పేరు మరిన్ని వివరాలను ప్రకటిస్తున్నాము’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఇప్పటి నుంచి ఏఐ ద్వారా సినిమాల్లో పలు సీన్స్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సంచలనాలు సృష్టించబోతున్నారని సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.