Aishwarya Rai: నాకు నా కూతురు కన్నా ఎవరూ ముఖ్యం కాదు.. ఐశ్వర్య రాయ్ ఎమోషనల్ కామెంట్స్

విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-12 03:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు చిహ్నంగా ఆద్య అనే కూతురు కూడా జన్మించింది. ఇలా అన్యోన్యంగా సంతోషంగా లైఫ్‌ను లీడ్ చేస్తున్న వీరు.. గత కొన్ని నెలలుగా విడాకులు తీసుకున్నారంటూ కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, దీనిపై ఇంతవరకు ఐష్ కానీ అభిషేక్ కానీ స్పందించలేదు. కాగా, ఐశ్వర్య పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ తన గారాల పట్టీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను నా 18 ఏళ్ల వయసులో చాలా బాధ్యతలు మోశాను. నేను ప్రతి రోజూ ఉదయం 5:30 గంటలకు లేచేదాన్ని. నాకు ఇప్పటికీ ఆ రోజులు గుర్తున్నాయి. కానీ, ఆరాధ్య పుట్టిన తర్వాత నా ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. ఆమె నాకు ముఖ్యం.. ఆమె తర్వాతే ఎవరైనా. ఆరాధ్య ఎప్పుడూ పాటలు పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి నా పాట, ఒక్కోసారి తన నాన్న పాట, ఇంకొన్ని సార్లు తాతయ్య పాటలు పాడుతుంది. ఆరాధ్య సాధారణ జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. అంతేకాదు కూతురు కన్నా నాకు మరెవరూ ముఖ్యం కాదు. ఆరాధ్యకు ఏది అవసరమో, అది నేనే చేయాలని భావిస్తున్నాను. కానీ, బిజీ షెడ్యూల్‌తో అలా చేయలేకపోతున్నాను. అయితే నాకు సపోర్ట్‌గా నిలిచే భర్త ఉన్నాడు. అందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని అంటూ ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Similar News