PPF: కేంద్ర ప్రభుత్వ స్కీమ్..నెలకు కేవలం రూ. 12,500తో 15ఏళ్లలో రూ. 1.50కోట్లు చేతికి.. రిస్క్ లేకుండా రిటర్న్స్

PPF Interest Rate: ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో స్కీమ్స్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు.

Update: 2025-03-22 09:00 GMT
PPF: కేంద్ర ప్రభుత్వ స్కీమ్..నెలకు కేవలం రూ. 12,500తో 15ఏళ్లలో రూ. 1.50కోట్లు చేతికి.. రిస్క్ లేకుండా రిటర్న్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: PPF Interest Rate: ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో స్కీమ్స్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. వీటినే పోస్టాఫీస్ స్కీమ్స్ అంటారు. ఇక్కడ చిన్న మొత్తాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చు. గ్యారెంటీగా రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మంచి డిమాండ్ ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సంపాదించిన దాంట్లో నుంచి కొంత పొదుపు చేస్తుండాలి. పొదుపు చేసిన దానిని మంచి స్కీముల్లో పెట్టుబడి పెట్టాలి. పెద్దగా రిస్క్ లేకుండా ఉండే స్కీములు చూసుకోవాలి. అప్పుడే వయస్సు పైబడిన సమయంలో రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం రిస్క్ లేని స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. వీటిల్లోనే పోస్టాఫీస్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. జనానికి వీటిపై నమ్మకంతోపాటు ఆసక్తి కూడా ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండటమే కాకుండా ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం రాబడి కూడా ఉంటుంది. గ్యారెంటీ రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చు. వీటిలో చాలా చిన్న మొత్తాల్లో పొదుపు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఒక స్కీము గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అదే పీపీఎఫ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్. పన్ను ఆదా చేసుకునేందుకు కూడా మంచి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలంలో డబ్బు పొదుపు కోసం ఇది మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు . ప్రస్తుతం పీపీఎఫ్ స్కీములో 7.10శాతం వడ్డీరేటు ఉంది. ఇక్కడ కాల వ్యవధి 15ఏళ్లు ఉంటుంది. అంటే వరుసగా 15ఏళ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వరుసగా 5ఏళ్ల చొప్పున పెంచుకుంటూ కూడా పోవచ్చు. ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి.

ఇక్కడ సంవత్సరానికి కనీసం రూ. 500 నుంచి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఏడాదిలో ఏకకాలంలో లేదా ఇన్ స్టాల్ మెంట్స్ రూపంలో డబ్బులను కట్టవచ్చు. కాబట్టి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు. నెలకు రూ. 12,500 లేదా ఏడాదికి రూ. 1.50లక్షల పెట్టుబడితో 15ఏళ్లలోనే చేతికి రూ. 41లక్షలు వస్తాయి. ఇక్కడ రూ. 22,50,000పెట్టుబడి పోగా మిగతాది వడ్డీ రూపంలో వస్తుంది.

ఒకవేళా ఇంకా గడువు పెంచుకుంటూ పోతే రిటర్న్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఇదే మరో 3 సార్లు ఐదేళ్ల చొప్పున పొడిగిస్తే మొత్తం 30ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. అంటే 30ఏళ్లలో ఏడాదికి రూ. 1.50లక్షల చొప్పున పెట్టుబడి మొత్తం రూ. 45లక్షలు కాగా వడ్డీతోనే కోటికిపైగా వస్తుంది. మెచ్యూరిటీకి మొత్తం రూ. 1.54కోట్లు చేతికి అందుతాయి. రెండేళ్లు కట్టిన తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే పెట్టుబడిపై వడ్డీ ఆదాయంపై మెచ్యూరిటీ రిటర్న్స్ పై ఎలాంటి టాక్స్ ఉండదు. పాత పన్ను విధానం ప్రకారం..ఆర్ధి సంవత్సరంలో రూ. 1.50లక్షల వరకు ట్యాక్స్ తగ్గించుకోవచ్చు.


Tags:    

Similar News