BREAKING: 30 ఏళ్ల తరువాత జ్ఞానవాపిలో పూజలు ప్రారంభం.. ఆనందోత్సాహాల్లో ప్రజలు

జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతిచ్చింది.

Update: 2024-02-01 01:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతిచ్చింది. వారంలోగా హిందువులు మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చేయాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం భక్తుల కోలాహలం నడుమ జ్ఞానవాపీ దగ్గర పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే బేస్‌మెంట్‌లో అర్చకులు మందిరాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. పూజ పూర్తయిన వెంటనే భక్తులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. 30ఏళ్ల తరువాత పరమ శివుడు జ్ఞానవాపీలో పూజలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాసీ మసీదు కేసు దేశంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ మసీదు కింద ఆలయం ఉందని.. ఆలయాన్ని కూలగొట్టి ఈ మసీదును నిర్మించారని హిందువులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు మసీదులో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఏఎస్ఐ డిపార్ట్‌మెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. మసీదులో సర్వే చేసిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నివేదికను ఇటీవల కోర్టుకు సమర్పించింది. ఏఎస్ఐ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మసీదు కింద ఆలయం ఉంది నిజమేనని.. ఆలయాన్ని కూలగొట్టే మసీదును నిర్మించినట్లు అధికారులు చేసిన సర్వేలో తేలింది. మసీదు కింద హిందువు దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు సైతం లభ్యం అయ్యాయి. ఈ క్రమంలో మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసేకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Tags:    

Similar News