బ్లాక్ ఫంగస్: మరో ప్రాణం బలి

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పలువురు బ్లాక్ ఫంగస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఏపీలో పలు బ్లాక్ ఫంగస్ మరణాలు నమోదవ్వగా.. తాజాగా మరో మరణం నమోదైంది. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ బాషా బ్లాక్ ఫంగస్ బారిన పడి మరణించాడు. 20 రోజుల క్రితం షేక్ బాషాకు కరోనా సోకగా.. కోలుకుని ఇటీవల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ క్రమంలో […]

Update: 2021-05-18 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పలువురు బ్లాక్ ఫంగస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఏపీలో పలు బ్లాక్ ఫంగస్ మరణాలు నమోదవ్వగా.. తాజాగా మరో మరణం నమోదైంది. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ బాషా బ్లాక్ ఫంగస్ బారిన పడి మరణించాడు.

20 రోజుల క్రితం షేక్ బాషాకు కరోనా సోకగా.. కోలుకుని ఇటీవల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ క్రమంలో బ్లాక్ ఫంగస్ సోకడంతో విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్‌లో చేరాడు. పరిస్థితి మరింత విషమించడంతో తాజాగా మరణించాడు.

Tags:    

Similar News