గవర్నర్ నజీర్‌కు వైఎస్ జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు.

Update: 2024-07-26 16:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలను ప్రభుత్వం వక్రీకరించిందని మొత్తం ఏడు పేజీలతో కూడిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం అబద్ధాలను గవర్నర్ ప్రసంగంలో పేర్కొందని తెలిపారు. కొన్ని వాస్తవాలను రికార్డులతో సహా గవర్నర్ దృష్టికి తీసుకొస్తున్నట్లు లేఖలో వెల్లడించారు. ఎకనామిక్ సర్వే, కేంద్ర గణాంకాలు, కాగ్ నివేదిక, ఆర్బీఐ నివేదికల్లోని వాస్తవాలను పొందుపరుస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News