Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు(Devotees) తరలి వస్తుంటారు.
దిశ,వెబ్డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. ఈ క్రమంలో కాలినడకన శ్రీవారిని చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ తరుణంలో నిత్యం వేలాది భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కిటకిటాలాడుతుంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ కొన్ని సార్లు అధికంగాను, కొన్ని సార్లు సాధారణంగా ఉంటుంది.
ఈ క్రమంలో నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు(సోమవారం) తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,263 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,733 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.65 రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.