తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) తరలి వస్తుంటారు.

Update: 2025-03-24 04:26 GMT
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో భక్తుల రద్దీ కొన్ని సార్లు అధికంగా, మరికొన్ని సార్లు సాధారణంగా ఉంటుంది. ఈ క్రమంలో నేడు(సోమవారం) భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే.. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం 7గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుంది.

టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న(ఆదివారం) తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) 3.94 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే గత పది రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవి తీవ్రత తగలకుండా భక్తులకు అన్ని వసతులను TTD ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News