ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ దాడి తీవ్ర సంచలనం కలిగించింది.

దిశ ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ దాడి తీవ్ర సంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి 30 వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. హాస్టల్ లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం డిమాండ్ చేయడంతో ఏలూరు లో ఏసీబీని బాధితురాలు ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ సీఐ ఎం బాలకృష్ణ, కే శ్రీనివాస్, రాజమండ్రి సీఐ ఎన్ వి భాస్కర్ రావు పాల్గొన్నారు.