Tirumala Samacharam: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Update: 2024-08-14 04:18 GMT
Tirumala Samacharam: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంళవారం శ్రీవారి దర్శనానికి జనం ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం స్వామి వారిని 73,246 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 28,133 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News