బెదిరించి డబ్బులు వసూలు చేశారు.. ఆత్మహత్యే గతి.. టీడీపీ కార్యకర్త మనోవేదన

గత వైసీపీ నాయకుల అన్యాయాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి.

Update: 2024-10-20 10:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : గత వైసీపీ నాయకుల అన్యాయాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. అప్పటి అధికార నేతల పేర్లు అడ్డుపెట్టుకొని మాచవరానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ తన దగ్గర డబ్బులు వసూలు చేశాడని టీడీపీ కార్యకర్త షేక్ సత్తార్ తీవ్ర ఆరోపణలు చేశాడు. తాను గ్రామంలో ఉండాలంటే రూ.లక్ష ఇవ్వాలని, లేదంటే జైలుకు పంపిస్తానని బెదిరించేవాడని అన్నారు. తన దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నా వినకుండా వైసీపీ నేతల పేర్లు చెప్పి తనను, ఇంట్లో వాళ్ళను భయబ్రాంతులకు గురిచేశాడని వెల్లడించారు. అప్పు చేసి తెచ్చిన ఆ డబ్బులు ఇపుడు తీర్చలేక పోతున్నానని, ఎలాగైనా హెడ్ కానిస్టేబుల్ వద్ద నుండి ఆ డబ్బు తిరిగి ఇప్పించాలని, లేదంటే ఆత్మహత్యనే శరణ్యమని వాపోయాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తనని ఆదుకోవాలని బాదితుడు కన్నీరు మున్నీరు అయ్యాడు. 


Similar News