AP News:అధికార పార్టీని వీడి హస్తం గూటికి చేరిన యువ నాయకుడు

అధికార టీడీపీని వీడి నేడు కాంగ్రెస్ కండువా కప్పుకున్న కాసరగడ్డ నాగార్జున.

Update: 2024-09-11 13:43 GMT

దిశ,వినుకొండ:అధికార టీడీపీని వీడి నేడు కాంగ్రెస్ కండువా కప్పుకున్న కాసరగడ్డ నాగార్జున. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా గత 5 సంవత్సరాలుగా పనిచేసిన నాగార్జున, నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షురాలు శ్రీమతి వై.ఎస్.షర్మిల నాయకత్వంలో అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి ఆకర్షితులై, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల గౌరవంతో పార్టీలో చేరానని అన్నారు. ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం కాగలదని విశ్వసిస్తున్నాను అన్నారు. నాగార్జున సేవలను రాష్ట్ర కమిటీలో వినియోగించుకొనే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది మరియు వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నూతన జవసత్వాలు వస్తాయని నాయకత్వం అభిలాషిస్తున్నది. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు .అలెగ్జాండర్ సుధాకర్, గొంది.సురేష్ మరియు సోమశేఖర్ పాల్గొన్నారు.


Similar News