‘స‌నాత‌న ధ‌ర్మాన్ని గౌర‌వించే నా గ‌ద్ద‌ర‌న్న‌కి న‌మ‌స్సుమాంజ‌లి’.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

తెలంగాణ జ‌న స‌మితి, తెలంగాణ జ‌న స‌భ‌తో పాటు ప‌లు ఉద్య‌మ సంస్థ‌ల ఏర్పాటుతో తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మానికి(Telangana Malidasha Movement) ఊపిరులూదిన వారిలో అగ్ర‌గ‌ణ్యుడు గ‌ద్ద‌ర్.

Update: 2024-10-03 09:34 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ జ‌న స‌మితి, తెలంగాణ జ‌న స‌భ‌తో పాటు ప‌లు ఉద్య‌మ సంస్థ‌ల ఏర్పాటుతో తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మానికి(Telangana Malidasha Movement) ఊపిరులూదిన వారిలో అగ్ర‌గ‌ణ్యుడు గ‌ద్ద‌ర్. పాట‌ను తూటాగా మార్చిన ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్. అయితే ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) ప్ర‌జా యుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్‌ను గుర్తుచేసుకుంటూ ఓ పాత వీడియోను ట్విట్ట‌ర్‌(Twitter) వేదిక‌గా పంచుకున్నారు. "ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నని స్మరించుకుంటూ.. సనాతన ధర్మాన్ని గౌరవించే నా గద్దరన్నకి నమస్సుమాంజలి" అని ట్వీట్ చేశారు. దీనికి ఓ పాత వీడియోను జోడించారు. అలాగే యాదాద్రి ఆల‌యం ఎదుట గ‌ద్ద‌ర్ మోక‌రిల్లి వంద‌నం చేసిన‌, ఆసుప‌త్రిలో చేరిన గ‌ద్ద‌ర్‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించి హ‌త్తుకున్న ఫొటోల‌ను జ‌న‌సేనాని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Tags:    

Similar News