Ananthapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌డెడ్

అనంతపురం జిల్లా శింగనమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

Update: 2024-10-26 10:44 GMT

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా శింగనమల(Shinganamala)లో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. నాయనపల్లి క్రాస్(Nayanapalli Cross) రోడ్డు వద్ద లారీ(Lorry)ని  కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు కారు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం- కడప జాతీయ రహదారిపై వెళ్తుండగా కారు టైరు పగిలి అదుపు తప్పి లారీ కింద‌కు దూసుకు వెళ్లింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర సంకీర్తన వేడుకల్లో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Similar News