‘పవన్ కల్యాణ్ చెప్పింది మీకు అర్థం కాలేదేమో అని మళ్లీ చెబుతున్నా’.. ప్రకాశ్ రాజ్‌కు జనసేన నేత కౌంటర్

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), నటుడు ప్రకాశ్ రాజ్‌(Prakash Raj)ల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.

Update: 2024-09-26 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), నటుడు ప్రకాశ్ రాజ్‌(Prakash Raj)ల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఇష్యూను దేశవ్యాప్తంగా ఎందుకు వ్యాపింపజేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించగా.. దానికి పవన్ కల్యాణ్ స్పందించి కౌంటర్ ఇచ్చారు. తాజాగా.. ప్రకాశ్ రాజ్‌కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetty Satyanarayana) కౌంటర్ ఇంచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘ప్రకాశ్ రాజ్‌ గారు మీ ట్వీట్‌లో రెండోసారి చదివి అర్థం చేసుకోవడానికి ఏముంది. విదేశాల్లో షూటింగులో ఉండి ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు.

పవన్ కల్యాణ్ గారు ఇది మా హిందువులకు సంబంధించిన విషయం దీనికి ఇస్తే మద్దతు ఇవ్వండి లేదా నోరు మూసుకోండి అన్నారు.. ఒకవేళ ఆయన చెప్పింది మీకు అర్థం కాలేదేమో నని నేను మళ్ళీ చెబుతున్నాను.. విదేశాల నుండి మీరు పంపిన వీడియో ఏ మతోన్మాదులకు సాయపడడానికో.. త్వరలో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను’’ అని బొలిశెట్టి ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు. కాగా, ‘‘డియర్ పవన్ కల్యాణ్ గారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. దయచేసి విచారించండి.. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు. సమస్యను ఎందుకు జాతీయంగా ఊదరగొడుతున్నారు.. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి’’ అని పెట్టిన ప్రకాశ్ రాజ్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.


👉    Click Here For Tweet


Similar News