Tirumala News:తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి మెట్టు మార్గం రీ-ఓపెన్‌

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-10-18 04:35 GMT

దిశ,వెబ్‌డెస్క్:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు శ్రీవారి మెట్టు మార్గం మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) తిరుమల శ్రీవారి మెట్టు మార్గం రీ-ఓపెన్‌ అయింది. తిరుమల శ్రీవారి మెట్లు నడకదారిలో భక్తులకు అనుమతి పునరుద్దరణ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తిరుమల శ్రీవారి మెట్టు రీ-ఓపెన్‌ చేశారు. ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలలోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 58,637 మంది భక్తులు నిన్న(గురువారం) శ్రీవారిని దర్శించుకున్నారు. 21956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.69 కోట్లుగా నమోదు అయింది.


Similar News