వైసీపీలో జగన్ తప్ప ఎవరు మిగలరు.. అలా చేసి టీడీపీలోకి వస్తే స్వాగతిస్తాం:ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ పార్టీ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Update: 2024-08-29 07:28 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ పార్టీ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరూ ఉహించని విధంగా దారుణమైన ఓటమిని చవిచూసిన వైసీపీ పార్టీని వీడేందుకు నాయకులు, నేతలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ, జనసేన పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే రాజ్యసభ సభ్యులు అయిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఈ రోజు వైసీపీ పార్టీకి, రాజ్యసభ ఎంపీ పదవులకు ఏక కాలంలో రాజీనామా చేశారు. అయితే వీరిద్దరు త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ వార్తలపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిందిని.. ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని.. వైసీపీ మునిగిపోయే నావ కాదని.. ఇప్పటికే మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. అలాగే వైసీపీలో జగన్‌ తప్ప ఎవరూ మిగలరని.. పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామని.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News