తిరుమలలో గంజాయి షాక్‌కు గురి చేసింది.. చంద్రబాబు నాయుడు

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి వార్త షాక్‌కు గురి చేసింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Update: 2023-03-25 07:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి వార్త షాక్‌కు గురి చేసింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో గంజాయి బూతం రోజురోజుకూ విస్తరిస్తోంది అనడానికి ఇదో సాక్ష్యం అని చెప్పుకొచ్చారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి అత్యంత ఆవేదన కలిగిస్తుందన్నారు. భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News