Breaking: వల్లభనేని వంశీకి మరోసారి సైతం బిగ్ షాక్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి సైతం బిగ్ షాక్ తగిలింది.

Update: 2025-04-01 11:37 GMT
Breaking: వల్లభనేని వంశీకి మరోసారి సైతం బిగ్ షాక్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former MLA Vallabhaneni Vamsi)కి మరోసారి సైతం బిగ్ షాక్ తగిలింది. భూ కబ్జా కేసు(Land Grabbing Case)లో ఆయన రిమాండ్‌ను ఈ నెల 15 వరకు విజయవాడ జిల్లా కోర్టు(Vijayawada District Court) పొడిగించింది. పలు కేసుల్లో ఇప్పటికే ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే భూ కబ్జా కేసులో వంశీ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా గన్నవరంలో సీతామహాలక్ష్మికి చెందిన 9 ఎకరాల భూమిని కబ్జా చేశారని వంశీపై ఫిర్యాదు అందింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో వంశీ తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అనుచరుడు రంగాను సీఐడీ కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఆయనను బుధవారం నుంచి పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు. 

Tags:    

Similar News