నా భార్యపై నాకు పూర్తి నమ్మకముంది.. రాజకీయంగా ఎదుగుతుందనే ఆరోపణలు: మాధురి భర్త మహేశ్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురి ఇష్యూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Update: 2024-08-13 08:11 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురి ఇష్యూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారనే మనస్థాపంతో తన కారును మరో కారుతో గుద్ది ఆత్మహత్యకు పాల్పడింది. కాగా ఈ రోజు ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ వివాదంపై అమెరికాలో ఉంటున్న మాధురి భర్త దివ్వెల మహేశ్ చంద్రబోస్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడాడు.. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. మాధురి ఇష్ట పడటం తోనే వైసీపీలోకి వెళ్లడానికి మద్దతు తెలిపానని చెప్పుకొచ్చారు. తన భార్యపై పూర్తి నమ్మకం ఉందని.. నా భార్య రాజకీయంగా ఎదుగుతుందని కారణంతో ఈ ఆరోపణలు చేస్తున్నారని భార్య మాధురికి మద్దతు పలికారు. అలాగే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం మాధురి మీడియాతో మాట్లాడుతూ.. వాణి రాజకీయ కోణంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆ కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News