విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ కేసు.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ కిడ్నాప్ కేసును పునర్విచారణ చేయనున్నట్లు డీజీపీ తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ...

Update: 2024-08-28 17:22 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ కిడ్నాప్ కేసును పునర్విచారణ చేయనున్నట్లు డీజీపీ తిరుమలరావు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన టీమ్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. వివిధ కేసులకు సంబంధించి డీజీపీ స్పందించారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం నేరస్తులు తమకు తెలుసని, వారి వెనుక ఎవరున్నారనేది తెలుసుకుంటున్నామన్నారు. ముంబై నటి కుటుంబాన్ని వేధించిన ఘటనలో అధికారుల ప్రమేయం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆ ఘటనపైనా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఎవరి ప్రమేయం ఉన్నా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక విశాఖలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే త్వరగా రికవరీ చేసే ఛాన్స్ ఉంటుందన్నారు. మన్యంలో గంజాయి పెంచకుండా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తిరుమలరావు తెలిపారు.


Similar News