అహంకారం తగ్గిస్తాం.. వదలిపెట్టం: వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ నాయకుల అహంకారం తగ్గిస్తామని, ఎవరినీ వదిలిపెట్టమని వైసీపీ నాయకులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...

Update: 2024-12-28 08:44 GMT
అహంకారం తగ్గిస్తాం.. వదలిపెట్టం: వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నాయకుల(Ycp Leaders) అహంకారం తగ్గిస్తామని, ఎవరినీ వదిలిపెట్టమని వైసీపీ నాయకులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Deputy Cm Pawan Kalyan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబు(Galiveedu MPDO Jawahar Babu)ను కడప రిమ్స్‌(Kadapa rims)లో పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. జవహర్ బాబుపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులు అహంకారంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం మాదిరి కాదని ఎవరు రెచ్చిపోయిన చూస్తూ ఊరుకోమని పవన్ హెచ్చరించారు.

జవహర్ బాబుపై దాడిని కలెక్టర్, ఎస్పీకి కంప్లైట్ చేశామని పవన్ చెప్పారు. ఎంపీపీ కార్యాలయంలో గడిపెట్టి మరి జవహర్ బాబుపై దాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అహంకారాన్ని అణచివేస్తామన్నారు. ఆధిపత్యపు అహంకారంతో అధికారులపై దాడుల చేస్తే అటువంటి వాళ్లను వదిలిపెట్టమన్నారు. కచ్చితంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. 11 సీట్లు వచ్చినా ఇంకా గాల్లో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారులపై దాడి చేసినా, విధులను అడ్డుకున్నా కఠిన చర్యలు తప్పవని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఆధిపత్య ధోరణితో దాడులు చేస్తే ఊపేక్షించమని వార్నింగ్ ఇచ్చారు. దాడి ఘటనలో పారిపోయిన వాళ్లను కూడా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. 

Tags:    

Similar News