AP News:ఆ రోజే సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన?
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే..ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అందులో భాగంగా SP మణికంఠ చందోలు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు.
Read More..
చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం ప్రభుత్వ పథకాలకు మళ్లీ పాత పేర్లు