తిరుమలలో హై అలర్ట్​.. వచ్చే నెల 24 వరకు కొనసాగనున్న పోలీసుల ఆంక్షలు

మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు.

Update: 2024-09-27 06:54 GMT

దిశ, డైనమిక్​ బ్యూరో: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు అందిస్తున్నారు. సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎటువంటి ర్యాలీలు చేయవద్దని ఆదేశాలు ఇస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నెలపాటు పోలీసుల ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. తిరుపతిలో వచ్చేనెల 24 వరకు పోలీసు ఆంక్షలు ఉంటాయి. అనుమతి లేకుండా ఎటువంటి ఊరేగింపులు, సభలు నిర్వహించవద్దని ఆదేశించారు. ర్యాలీలు, సభలు, భేటీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు పేర్కొన్నారు.


Similar News